హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ పాలిసెట్-2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందిరా ప్రియదర్శిని కళాశాలలో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాలిసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 22న జరిగిన పాలిసెట్కు 1,28,118 మంది విద్యార్థులు హాజరయ్యారు.