భువనగిరి : భువనగిరి మండలం నందనం గ్రామ సమీపంలో ఉన్న గౌడ పారిశ్రామిక కేంద్రంలో యంత్రం సహాయంతో తాటిచెట్లు ఎక్కేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ప్రారంభించారు. అనంతరం యంత్ర సహాయంతో ఎంపీ బూర నర్సయ్య తాటి చెట్టు ఎక్కారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనితా రామచంద్రన్, డీఆర్డీఏ వెంకట్రావ్, ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి కృష్ణ ప్రియ, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో పాటు గౌడ సంఘాల నేతలు పాల్గొన్నారు.