పిడుగు పడి యువకుడి మృతి పరిగి: పిడుగు పడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం పరిగిలోని మల్లెమోనిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తుమ్మల లక్ష్మయ్య(35) అదే గ్రామానికి చెందిన నాగరాజు శేఖర్లతో కలిసి పశువులను మేపేందుకు గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లారు. సుమారు 5 గంటల ప్రాంతలో ఉరుములతో కూడిన వర్షం మొదలైంది. ఈ క్రమంలో వారు తలదాచుకునేందుకు సమీపంలోని మామిడిచెట్టు కిందకు చేరారు.ఇదే సమయంలో ఉరుములు మెరుపులతో పిడుగు పడడంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. శేఖర్ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.