బీజింగ్: చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొగ్గు గనుల్లో కూలీలు పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైంది. దీంతో 18 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. హునాన్ ప్రావిన్స్లో ఈ ఘటన జరిగింది.హుయాంగ్ఫెంగ్కియో ప్రాంతంలోని ఓ బొగ్గుగనిలో పనులు జరుగుతుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయింది. ఘటనలో సమయంలో 55 మంది కూలీలు గనిలో పనిచేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. 37 మంది కూలీలను రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. మిగతా 18 మంది గనిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వీరంతా పొగ కారణంగా వూపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. లీకైన గ్యాస్ విషవాయువు అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.