ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి తెలంగాణలో మామిడిపండ్లు ఎక్కుగా పండాయని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2017, 10:27 AM

న్యూఢిల్లీ: ఢిల్లీవాసులకు రుచికరమైన మామిడిపండ్లను తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ అందిస్తోంది. ఉమ్మడి భవనలో ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన మామిడి పండ్ల విక్రయశాలను టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌, తెలంగాణ భవన రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌కుమార్‌ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం మామిడిపండ్లను రసాయనాలతో మగ్గిస్తున్నారని, సురక్షితమైన, సహజమైన పద్ధతుల్లో పండించిన, రుచికరమైన మామిడిపండ్లను ఉద్యానవన శాఖ విక్రయిస్తోందన్నారు. రైతులకు మార్కెట్‌ రేటు కంటే 25ు ఎక్కువగా చెల్లించి, మామిడి పండ్లను వారి నుంచి నేరుగా సేకరించి ఇలా విక్రయిస్తోందన్నారు. ఈసారి తెలంగాణలో మామిడిపండ్లు ఎక్కుగా పండాయని, ఉత్తరాదిలో మార్కెట్‌లోకి నెల రోజులు ఆలస్యంగా వస్తాయన్నారు. ఆహార భద్రతా నియమాల ప్రకారం 32 రకాల పరీక్షలు నిర్వహించి, ఎలాంటి రసాయనాల ప్రయోగం లేదని నిర్థారించిన తర్వాతే రాష్ట్ర ఉద్యానవన శాఖ ఈ పండ్లను విక్రయిస్తోందని రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ వేదాంత గిరి, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు. 10 మామిడి పండ్లు ఉన్న ప్యాకెట్‌ను రూ.450 చొప్పున విక్రయిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com