ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోరాడి విజయం సాధించింది

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 10, 2017, 10:42 AM

ఐపీఎల్ పదో సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పోరాడి విజయం సాధించింది. మొహాలి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మంగళ వారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 168 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని 14 పరుగులతో పంజాబ్ విజయాన్ని అందుకుంది. కెప్టెన్ మాక్స్‌వెల్ (44: 25 బంతుల్లో 1x4, 4x6), సాహా (38: 33 బంతుల్లో 2x4, 1x6) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో క్రిస్‌లిన్ (84: 52 బంతుల్లో 8x4, 3x6) దూకుడుగా ఆడటంతో కోల్‌కతా అలవోకగా గెలిచేలా కనిపించింది. కానీ.. గంభీర్ (8), ఉతప్ప (0), మనీశ్ పాండే (18), యూసఫ్ పఠాన్ (2) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్నారు. దీంతో మధ్య ఓవర్లలో కోల్‌కతాపై ఒత్తిడి పెరిగినా క్రీజులో లిన్ ఉండటంతో ఆ జట్టు గెలుపుపై ఆశతోనే ఉంది. కానీ.. జట్టు స్కోరు 132 వద్ద లేని పరుగు కోసం ప్రయత్నించి లిన్ రనౌటవడంతో మ్యాచ్ పంజాబ్ వైపు మళ్లింది. చివర్లో పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులు నియంత్రిస్తూనే వికెట్లు తీయడంతో కోల్‌కతా 156/6కే పరిమితమైంది. టోర్నీలో 12వ మ్యాచ్ ఆడి ఆరో విజయం అందుకున్న పంజాబ్ ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఓడింటే హైదరాబాద్‌కి మార్గం సుగమమయ్యేది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com