హైదరాబాద్ :గతరాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో నగరంలోని పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెట్లు, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ విరిగిపడడంతో విద్యుత్ తీగలు తెగిపోయి ఇందిరానగర్, కృష్ణానగర్, శాలివాహన నగర్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.