యాదాద్రి, మేజర్న్యూస్: రైతులకు మద్దతు ధర చెల్లించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత కారణంగా కొనుగోళ్లు నిలిపివేశారు. భువనగిరి కొత్తమార్కెట్ యార్డులో గోనెసం చుల కొరత కారణంగా కొనుగోళ్లు ఆగిపో యాయి. దీంతో రైతులు రెండు రోజులుగా తమ ధాన్యంరాశులతో పడిగాపులు కాస్తు న్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలుకోసం ఈ ఖరీఫ్సీజనకు 119 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు దాదాపు 1.10లక్షల మెట్రిక్టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు ప్రకటించారు.ఈ ఏడాది జిల్లాలో 1.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే ఇంకా దాదాపు 65 వేల మెట్రిక్టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే కొను గోలుకేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత కారణంగా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. ఓవై వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండటం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోల్లు నెమ్మదించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు అవస రమైన గన్నీబ్యాగులు సరఫరా చేసి కొనుగోళ్లు ముమ్మరం చేయాలని కోరుతున్నారు.