ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గద్వాల బస్‌స్టాండులో లోపించిన పారిశుద్ధ్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:28 AM

  జోగుళాంబ గద్వాల, మేజర్‌న్యూస్‌. రోజురోజుకు గద్వాల బస్టాండు అపరిశుభ్రంగా తయారవుతుందని పలువురు ప్రయాణీకులు ఆరొపించారు. చినుకు పడితే చిత్తడిగా మారి బస్టాండులొ నిలబడాలంటేనే ప్రయాణీకులు జంకుతున్నారు. తమ విలువైన దుస్తులు ఖరాబ్‌ అయ్యేలా పరిసరాలు ఉండటంతొ ప్రయాణీకులు బస్టాండులొ నిల్చొవడానికి , కూర్చొవడానికి కూడా వీలు లేనట్లుగా ఉందని తెలిపారు. బస్టాండులొ కనీసం కుర్చిలు సరిగా లేవని బెంచీలు సరిగా లేవని అలాగే ఎప్పుడు కూలుతుందొ తెలియని పైకప్పుతొ ప్రయాణీకులు భయాందొళనలకు గురవుతున్నారు. ముపె్పై ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండుకు అప్పుడప్పుడు మరమ్మత్తులు చేయాల్సి ఉండగా డిపొ మేనేజర్లు పట్టించుకొనందున బస్టాండు పైకప్పు పెచ్చులూడుతు ఉందని ఎప్పుడు తమపై పడుతుందొ తెలియదని ప్రయాణీకులు, సిబ్బంది ఆరొపించారు. గద్వాల బస్టాండు ప్రస్తుతం అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాలలొ బస్సులు నడపాల్సి ఉంది ఈతరుణంలొ బస్టాండు స్థాయి పెంచాల్సిన అధికారులు అస్సలు పట్టించుకొవడం లేదని తెలిపారు. వర్షకాలం చినుకు పడితే చిత్తడిగా మారి బస్టాండు పరిసరాలు మురుగునీరు, వర్షపు నీటితొ నిండిపొయి దొమలు సై్వర విహారం చేస్తుంటాయని ప్రయాణీకులు తెలిపారు. నిత్యం వందలాది మంది ప్రయాణీకులు వచ్చిపొయే ఈబస్టాండులొ తాగునీటి వసతి సరిగా లేదని మరుగుదొడ్ల నిర్వహణ మాత్రం సరిగా ఉందని తెలిపారు. ఇక్కడ పనిచేసే సఫాయి సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని తెలిసింది. బస్టాండు ఆవరణలొ వర్షపు నీరు నిలిస్తే దానిపై మొరం వేయిం చాల్సిన డిపొ అధికారులు పట్టించుకొవడం లేదన్నారు. ప్రస్తుతం రాయచూర్‌ బస్సులు హైదరాబాద్‌నుండి ఇక్కడకు వస్తుండటంతొ నిత్యం బస్టాండు రద్దీగా మారింది దీంతో ఇక్కడి వ్యాపారులు ప్రయాణీకులను దోచుకుంటున్నారని అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రయాణీకులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాల్సిన బస్టాండులొ ఉదయం11 గంటలకే చెత్తచెదారం అధికం కావడంతొ వాటిని వెంటనే తొలగించే సిబ్బంది అధికమొత్తంలొ లేక పొవడంతొ బస్టాండు రొజురొజుకు అపరిశుభ్రంగా తయారైందని పలువురు ప్రయాణీకులు ఆరోపించారు.ఇప్పటికైనా డిపొ అధికారులు పర్యవేక్షించి బస్టాండు స్థాయి పెంచాలని, మరమ్మత్తులు చేయించాలని, పరిశుభ్ర వాతావరణం కల్పించాలని పలువురు కొరుతున్నారు.


    డిపోకు కొత్తగా వచ్చిన బస్సుల ప్రారంభమె ప్పుడని ప్రయాణీకులు అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని డిపోలలోకొత్తబస్సులు ప్రారంభం కాగా గద్వాల డిపోలోమాత్రం ఇంకా ప్రారంభం కానుందున ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొత్తబస్సులు ప్రారంభించని పక్షంలోవచ్చిన 4 బస్సులు మహబూబ్‌నగర్‌ డిపోకు తరలి పోనున్నాయని ప్రచారం రేగింది. ఇప్పటికైనా అదికారులు త్వరలొ బస్సులు ప్రారంబించాలని కోరుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com