ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర అవతరణ ఉత్సవాలు సందర్భంగా 25 మంది ప్రముఖులకు జిల్లా స్థారుు అవార్డులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:29 AM

  సూర్యాపేట మేజర్‌న్యూస్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు సందర్బంగా జిల్లాలో వివిద రంగాలకు చెందిన 52 మంది ప్రముఖులను జిల్లా స్ధాయి అవార్టుతో సత్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ కె. సురేంద్రమోహన్‌ తెలిపారు. తమ శాఖల పరిధిలో విశిష్ట సేవలు అందిస్తున్న మరియు గుర్తింపు తెచ్చుకున్న కనీసం 5 గురు అభ్యర్దులచే దరఖాస్తు చేయించాలని జిల్లా అధికారులకు నిర్ధేశించారు. ప్రతి అవార్డుకు రూ. 51,116/- నగదుతో పాటు శాలువా, ప్రశంసా పత్రము, మెమెంటోలను రాష్ర్ట విద్యుత్‌, ఎస్సీ అభివృద్దిశాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డిచే ఇప్పించనున్నట్లు తెలిపారు. ఈనెల 21లోపు కలెక్టరేట్‌ కాంపప్లెక్స్‌లోని జిల్లా పౌరసంబందాల అధికారి కార్యాలయంలో అందజే యాలని సూచించారు. దరఖాస్తులను నేరుగా కాని, సంబందిత శాఖల అధికా రుల ద్వారానైనా అందజేయవచ్చునని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌ నందు నిర్వహించిన ప్రజావాణి సందర్బంగా జిల్లా కలెక్టర్‌ కె. సురేంద్రమోహన్‌ మాట్లాడుతూ జిల్లా గౌరవాన్ని ప్రతిష్టను పెంపొందించే విధంగా రాష్ర్ట అవతరణ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే విశిష్ట సేవలు అందించిన ప్రము ఖులను సత్క రించ నున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు దర ఖాస్తులో అభ్యర్ధి వివారాలతో పాటు అధార్‌ కార్డు సంఖ్య, సెల్‌ఫోన్‌ నెంబర్‌, మెయిల ఐడి(ఉన్నటైతే), వృత్తి ఏ రంగంలో అవార్డుకై దరఖాస్తు చేస్తున్నారు. అనుభవం, జాతీయ, అంతర్జా తీయ, రాష్ర్ట స్థాయిలో పొందిన అవార్డులు పేర్కొనాలని తెలిపారు. అలాగే ఆధార్‌ కార్డు, వృత్తి అనుభవం, పొందిన అవార్డుల జీరాక్స్‌ ప్రతులు, ఫోటోలను జతపరచాలని తెలిపారు. జిల్లా స్థాయి అవార్డుకై పరిశీలించేరంగాల: ఉత్తమ రైతు (వ్యవసాయ, ఉద్యానవనం, మత్స్య, సెరీకల్చరీ, పశుసంవర్థక, పాల ఉత్పత్తి) ఉత్తమ ఉపాద్యాయుడు, ఉత్తమ అంగన్‌వాడీ కార్యకర్త, ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి, ఉత్తమ సోషల్‌వర్కర్‌, ఉత్తమ వైద్యులు, ఉత్తమ యన్‌జివో, ఉత్తమ క్రీడాకారుడు, ఉత్తమ సాహిత్యకారుడు-కవి, రచయిత, పద్య, గద్య కారుడు (తెలుగు/ఉర్ధూ భాషల్లో) ఉత్తమ ఆర్టిస్టు-డ్యాన్సర్‌, సింగర్‌, మ్యూజి షియన్‌, శిల్పకారుడు, కళాకారుడు, ఉత్తమ వేదపండితుడు, ఉత్తమ అర్చకుడు, ఉత్తమ జర్నలిస్టు, ఉత్తమ మండలం, ఉత్తమ మున్సిపాలిటీ, ఉత్తమ గ్రామ పంచాయితీ, ఉత్తమ లాయర్‌, ఉత్తమ సైంటిస్టు, ఉత్తమ పారిశ్రామికవేత్త, ఇతర రంగాల్లో జిల్లాకు గుర్తింపు తెచ్చిన  వ్యక్తులను జిల్లా స్థాయి అవార్డుకు ఎపింక చేయనున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో సంయుక్త కలెక్టర్‌ డి. సంజీవరెడ్డి, ఆర్‌డివో పి. యాదిరెడ్డి, సమాచార శాఖ ఏడి యాసా వెంకటేశ్వర్లు, డిఆర్‌డివో కిరణ్‌కుమార్‌ వివిధ శాఖల అధికారుల పాల్గొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com