ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిషన్‌ కాకతీయ క్రింద రూ. 440 కోట్లతో 747 చెరువుల పునరుద్ధరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 02:30 AM

  సూర్యాపేటప్రతినిధి/(రూరల్‌), మేజర్‌న్యూస్‌ : మిషన్‌ కాకతీయ క్రింద జిల్లాలో మూడు విడుతల్లో 747 చెరువుల పునరుద్దరణకు రూ. 440 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు రాష్ర్ట విద్యుత్‌, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జి. జగదీష్‌రెడ్డి తెలిపారు. సోమవారం సూర్యాపేట మండలం బాలెంల గ్రామ పంచాయితీ పరిధిలో రూ. 54 లక్షలతో చేపట్టి మోదుగులకుంట పునరుద్దరణ పనులకు శంఖుస్థాపన చేశారు. ఈసందర్బంగా రైతులను ఉద్ధేశించి మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ మొదటి దశ క్రింద రూ. 220 కోట్లతో చేపట్టిన 293 చెరువు పనులు దాదావు పూర్తి కావచ్చినట్లు తెలిపారు. మూడవ దశ క్రింద 220 చెరువు పనులకు రూ.110 కోట్లు మంజూరి అయినట్లు తెలిపారు. చెరువుల పురుద్దరణతో భూగర్భ జలాలు పెరిగినట్లు తెలిపారు. అదేవిదంగా సూర్యాపేరట నియోజకవర్గంలో తెలిపారు. తద్విర 14 వేల ఎకరాల ఆయకట్టు స్థీరికరించబడుతుందని తెలిపారు. వర్షాలకు కురిపించే శక్తి మనకులేదని, చెట్లును విరివిగా పెంచడంవల్ల పచ్చదనం పెరిగి మేగాఉల ఆకర్షించబడి   వర్షాలు వస్తాయని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువల మరమ్మత్తు పనులను ఆరు నెలలలో పూర్తి చేయించినున్నట్లు మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. వచ్చే రబీ సీజన్‌కు రెండు పంటకు నీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫి చేస్తామని, వచ్చే సంవత్సరం నుండి పెట్టుబడిగా ప్రతి ఎకరానికి రూ. 4 వేలను రైతులకు అందించనున్నట్లు తెలిపారు. పెట్టుబడిని తగ్గించుకొని, అధిక దిగుబడులను సాధించే సేంద్రియ వ్యసాయ పద్దతును వైపు మళ్ళాలని రైతులకు పిలువునిచ్చారు. వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ సరఫరాలను చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో రూ. 3కోట్లతో అన్ని రకాల సదుపాయాలను కల్పించినట్లు మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు పొంది, ప్రసవాలు చేయించుకున్న గర్భిణీలకు రూ. 12వేలను ఆర్ధిక సహాయంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తె లిపారు. మిషన్‌ భగీరధ ద్వారా డిసెంబర్‌ నాటికి ప్రతి వ్యక్తికి రోజుకు 140 లీటర్లు నీటిని ఇంటింటికి నల్లాల ద్వారా సరఫరా చేసేందుకు చేపట్టిన పనులు శరవేగంగా జరగుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పించెన్లు లబ్దిదారులు వున్నారని పారదర్శకంగా అర్హులందరికి ప్రభుత్వ ప్రయోజనాలను పొందే వేసుబాటు కల్పించినట్లు తెలిపారు. 


   ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమిటి చైర్మన్‌ వై. వెంకటేశ్వర్లు, యంపిపి వట్టే జానయ్య యాదవ్‌, నీటిపారుదల శాఖ ఇఇ సంజీవన్‌రెడ్డి, డిఇ రఘనాద్‌ ప్రసాద్‌, సర్పంచ్‌ యం. ప్రభాకర్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.   










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com