ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌తో కేసీఆర్‌ భేటీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 16, 2017, 03:07 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : గవర్నర్‌ నర్సింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హస్తిన నుంచి మూడు రోజుల క్రితం తిరిగి వచ్చిన ఆయన, గవర్నర్‌తో నేడు భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ధర్నాచౌక్‌ తర లింపును నిరసిస్తూ ప్రజాసంఘాలు, విపక్షాలు ఆందోళన నేపథ్యం లో, ఇరువురి మధ్య ఈ అంశం చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంది రాపార్కు నుంచి ధర్నాచౌక్‌ను తరలించాలని స్థానికులు కోరుతున్నా రని, ఈ సందర్భంగా గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ వివరించినట్లు సమాచారం. ఇదే విషయమై వారు న్యాయస్థానాలనాశ్రయిం చారని, ఇప్పటికీ ధర్నాచౌక్‌ తరలింపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్న ఆయన, అనవసరంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు రాద్దాంతం చేస్తున్నా యని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ధర్నాచౌక్‌ను నగరశివారు ప్రాంతాలకు తర లించాలని నిర్ణయించామని వెల్లడించినట్లు తెలిసింది.  అదే సమయంలో ఖమ్మం మార్కెట్‌యార్డుపై దాడి ఘటనలో అరెస్టయిన వారికి న్యాయస్థానానికి తరలించే సమయంలో చేతికి సంకెళ్లు వేసిన ఘటన తీవ్ర వివాదస్పదం కావ డం, సర్కార్‌ వెంటనే స్పందించి చేపట్టిన చర్యలను గవర్నర్‌కు కేసీఆర్‌ వివరిం చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయపరిస్థితులను  గవర్నర్‌కు వివరించిన కేసీఆర్‌, పలు అంశాలపై  ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం.  ఢిల్లీకి  వైద్యసహాయం నిమిత్తం వెళ్లిన కేసీఆర్‌, కేంద్ర హోం మంత్రి నేతృత్వంలో జరిగిన నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు గైర్హాజరయిన విషయం తెలిసిందే.  నక్సల్స్‌ ప్రభావిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నప్పటికీ ఆయన గైర్హాజరు హాట్‌ టాఫిక్‌గా మారింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com