కామన్ వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్ సదస్సులో పాల్గొనేందుకు ఎంపీ కవిత లండన్ వెళ్లారు. ఈ ఈ రోజు నుంచి 27 తేదీ వరకు ఆమె లండన్ లో పర్యటిస్తారు.
కామన్ వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్ ను ప్రోత్సహించేందుకు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు ఈ సదస్సు చర్చిస్తుంది. లింగ పరమైన వివక్ష లేకుండా మహిళల అభ్యున్నతి కోసం, రాజకీయ సాధికారత కోసం అవసరమైన విద్య, సమాచార మార్పిడి తదితర విషయాలపై సదస్సులో చర్చిస్తారు. కామన్ వెల్త్ దేశాల పార్లమెంటులలో మహిళలు ఉ సవాళ్లు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపు ఉ చర్యలు, దేశాల వారీగా మహిళల సమస్యలు, కామన్ వెల్త్ దేశాల మహిళా పార్లమెంటేరియన్స్ సదస్సు, మహిళా పాలసీ రూపకల్పన తదితర అంశాలపై సెమినార్లు ఉంటాయి. లండన్ చేరుకున్న ఎంపీ కవితకు లండన్ ఎయిర్ పోర్టులో తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డం సభ్యులు ఘన స్వాగతం పలికారు. మహిళా పార్లమెంటేరియన్స్ సదస్సుతో పాటు ఎంపీ కవిత గౌరవార్థం తెలంగాణ జాగృతి ఉ యునైటెడ్ కింగ్డం శాఖ నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొంటారు.