హైదరాబాద్ : భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 47 పరుగుల వద్ద కోహ్లీ అవుటయ్యాడు. 13 పరుగుల చేసిన కోహ్లీ ఒకీఫీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో భారత్ విజయావకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. 441 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ త్వరత్వరగా మూడు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో కూరుకు పోయింది.