మేజర్న్యూస్ తెలంగాణ ప్రతినిధి : దేశ వ్యాప్తంగా నరేంద్ర మోఢీ హవా కొనసాగుతుందని కేంద్ర మంత్రి పి రాధా కృష్ణణ్ అన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పార్టీ విస్తరించిందన్నారు. శుక్రువారం వరంగల్ పార్లమెంట్ పరిదిలోని బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశంలో పాల్గొనేందుకు వరంగల్కు వచ్చిన ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్టాడారు. దేశంలో పదహరు రాష్ట్రాలలో ఎన్డీఏ అధికారంలో ఉందని గుర్తు చేశారు. అదే స్పూర్తితో దక్షిణ తెలంగాణలోను పార్టీని బలోపేతం చేస్తామని ఆయన వివరించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్తతిగా తుడిచి పెట్టుకుపోయిందన్న ఆయన బిజెపిని ఎదుర్కొని నిలబడే సత్తా ఇతర పార్టీలకు లేదన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులతో చేపట్టిన అభివృద్ది పనులను తాము చేశామంటు చెప్పుకోవడం టిఆర్ఎస్ నేతలకు అలవాటయిపోయిందని ఆయన విమర్శించారు. మూడు సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మినహ సాదించింది ఏమి లేదన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలచే రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లే దమ్ము అధికార పార్టీ నేతలకుందా అని ఆయన ప్రశ్నించారు. కమలాపూర్ గ్యాస్ ప్లాంట్ను తాము అధికారంలో ఉన్నపుడు మంజూరు చేయిస్తే దానిని టిఆర్ఎస్ పార్టీ తీసుకు వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు మద్దతునిచ్చిన పార్టీగా బిజెపికి తెలంగాణ ప్రజల మనసులలో సుస్థిర స్థానం ఉందన్నారు. తమపై ఎవరెన్ని విమర్శలు చేసిన వచ్చే సార్వత్రిక ఎన్నికలలో అధికారంలోకి వస్తామన్నారు. టి జెఎసి నేతలపై టిఆర్ఎస్ నేత లు తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. తటస్థులు మేధావులు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు డా లక్ష్మణ్, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, మార్తినేని ధర్మారావు, డాక్టర్ రాజేశ్వర్రావు, చందుపట్ల కీర్తిరెడ్డి, వెన్నంపల్లి పాపయ్య, రమేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.