హైదరాబాద్: ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. శాక్రమెంటోలో జరుగుతున్న ప్రపంచ పర్యావరణ జలవనరుల సదస్సుకు మంత్రి హాజరయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి నీరు అత్యంత ప్రాధాన్యత అంశమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 30 వేల మైళ్ల పైప్లైన్కు గానూ 17 వేల మైళ్ల పైప్లైన్లు ఇప్పటికే వేసినట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో 46 వేల చెరువులను తిరిగి పునరుద్దరించేందుకు మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.