హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు రెండోరోజు నల్గొండలో పర్యటించనున్నారు. వెలుగుపల్లిలో దీన్దయాళ్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. పెద్దదేవులపల్లిలో ఇంటింటి వెళ్లి ప్రచారం చేయనున్నారు. బూత్ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నారు. గ్రామస్థులతో అమిత్ షా చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఓబీసీ అసోసియేషన్ తరపున అమిత్ షాను సన్మానించనున్నారు.