హైదరాబాద్ : మియాపూర్ భూ ఆక్రమణలపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు. గోల్డ్స్టోన్ ప్రసాద్, అతని భార్య ఇంద్రాణి, కోడలు మహితా కాడ్మిల్ పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి వారి కోసం 8 బృందాలతో దేశవ్యాప్తంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మియాపూర్తో పాటు బాలానగర్, మైలార్దేవ్పల్లి, ఎల్బీనగర్లో భూ కుంభకోణాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ప్రభుత్వ పోరంబోకు భూములను గోల్డ్స్టోన్ నకిలీపత్రాలతోరిజిష్టర్ చేయించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. అలాగే గోల్డ్స్టోన్ సంస్థలోని 11 మంది డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు.