ఉత్తరప్రదేశ్ మంత్రి స్వాతి సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బార్ ఒపెనింగ్ కు వెళ్లిన ఆమెపై విపక్షాలు మండిపడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం మద్యాన్ని ప్రమోట్ చేస్తోందని కాంగ్రెస్, ఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం మహిళా మంత్రిని సపోర్ట్ చేస్తోంది. యూపీలో మద్య నిషేధమేమీ అమల్లో లేదని, అలాంటప్పుడు బార్ ఓపెనింగ్ కు మంత్రి వెళ్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆ బార్ ఓనర్ కూడా ఓ మహిళ అని, మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించేందుకు మంత్రి ఓపెనింగ్ కు వెళ్లారని చెప్పారు. అటు ఈ ఘటనపై సీఎం యోగీ ఆదిత్యానాథ్ సీరియస్ అయ్యారు. మంత్రిని వివరణ కోరినట్లు సమాచారం. గతంలో స్వాతి సింగ్ భర్త మాయావతిపై అనుచిత వాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. తాజా ఆమె ఈ వివాదంలో చిక్కుకున్నారు.