లండన్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు మ్యాథ్యూస్ ఆడటం లేదు. దీంతో తరంగ నాయకత్వం వహించనున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత లసిత్ మలింగ మళ్లీ జట్టులో చేరాడు. వచ్చే మ్యాచ్కు మ్యాథ్యూస్ ఫిట్నెస్ సాధించే అవకాశం ఉందని తరంగ వెల్లడించాడు.