లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది శ్రీలంక. ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న ఇండియా గెలిస్తే సెమీస్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంటుంది. తొలి మ్యాచ్లో ఓడి శ్రీలంక ఒత్తిడిలో ఉండగా పాక్పై గెలుపు ఇచ్చిన కిక్కుతో విరాట్ సేన బరిలోకి దిగుతున్నది. పాకిస్థాన్తో ఆడిన టీమ్నే ఈ మ్యాచ్కూ భారత్ కొనసాగించింది.