హైదరాబాద్: రూ.80వేలు లంచం తీసుకుంటూ విద్యుత్శాఖ ఎస్ఈ శివరాజ్ రాథోడ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఇండస్ట్రీయల్ నుంచి కమర్షియల్ గా పర్మిషన్ మర్చేందుకు శివలింగం అనే వ్యక్తిని రూ. లక్ష డిమాండ్ చేశాడు. చివరకు రూ.80 వేలు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఏసీబీ అధికారులకు సమాచారం అందించిన బాధితుడు సైఫాబాద్లోని ఐమాక్స్ థియేటర్ వద్ద పైసలు ఇస్తుండగా రెడ్హాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం అడిగితే తమకు సమాచారం అందించాలని సూచించారు.