థానే: అమెరికా వాసులను మోసగిస్తున్న నకిలీ కాల్ సెంటర్ గుట్టును మహారాష్ట్ర పోలీసులు రట్టు చేశారు. అమెరికాలోని ఓ బ్యాంక్ పేరుతో లోన్లు ఇస్తామని, పన్నుల రాయితీ లభిస్తుందని చెబుతూ అక్కడి ప్రజల నుంచి కమీషన్ పేరుతో మోసం చేస్తున్నట్లు వెలుగుచూసింది. దీంతో థానేలోని ఓ కాల్ సెంటర్పై పోలీసులు రైడ్ చేశారు. ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. అందులో పని చేస్తున్న 25 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.