ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2019లో అధికారం మాదే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2017, 12:51 AM

  మేజర్‌న్యూస్‌, చంద్రగిరి : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ఆర్‌ ఆశయ సాధన కోసమే పుట్టిందని, రానున్న 2019 ఎన్నికల్లో గెలిచి ప్రజలకు వైఎస్‌ ప్రతి సంక్షేమ పథకాలను అందిస్తామని మాజీ మంు్తల్రు ధర్మాన ప్రసాదరావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు తెలిపారు. చంద్రగిరి వైఎస్‌ఎంఆర్‌ కల్యాణ మండపంలో వైఎస్‌ఆర్‌ ప్లీనరీ సమావేశం చంద్రగిరి శాసనసభ్యులు డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూల మాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభికులను ఉద్దేశించి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు హామీలు అన్ని నీటి మాటలు అన్యాయమని, అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదన్నారు. మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా, నట్టేట ముంచిన చంద్రబాబును ఎవ్వరూ నమ్మ కూడదన్నారు. రైతులకు రుణమాఫీ, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రజలను దగా చేశారన్నారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తు న్నారని, చంద్రబాబును అధికారం నుంచి సాగనంపేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చంద్రబాబుకు అధికారం దూరం చేయా లన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని, రాబోవు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి జగన్మోహన్‌ రెడ్డిని సిఎం చేయాలని, అది చంద్రగిరి నుంచే ప్రారంభం కావాలన్నారు. 2019 ఎన్నికల్లో అధికారం ధ్యేయంగా ప్రతి కార్య కర్త చంద్రబాబు పతనానికి కారణం కావాలన్నారు. అధికారంలోకి రాగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రతి సంక్షేమ పథకాన్ని కొనసాగి స్తామన్నారు. అనంతరం తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ను సిఎంను చేసే వరకు ప్రతి కార్యకర్త, నాయకుడు కష్టపడి పనిచేయాలన్నారు. కేవలం వైఎస్‌ఆర్‌ ఆశయ సాధన కోసమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు. ప్రతి ఒక్కరు పార్టీని ఆదరించా లన్నారు. జగన్‌ను కాంగ్రెస్‌, టిడిపిలు ఎన్ని కష్టాలు పెట్టాయో ప్రజలు గుర్తుం చు కోవాలన్నారు. గత ఎన్నికల్లో బాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. అనంతరం పలువురు నాయ కులు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డిలను సన్మానించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిం చారు. ఈ కార్య క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్‌ తిప్పారెడ్డి, సునీ ్‌కుమార్‌, నాయకులు జంగాలపల్లి శ్రీనివాసులు, మస్తాన్‌, కేశవులు, చిన్ని యాదవ్‌, మల్లం చంద్రమౌళిరెడ్డి, కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిడి కల్లూరి కుసుమ కుమారి, ఎంపిటిసిలు నవనీతమ్మ, మస్తాన్‌ (బుజ్జి), సిఎం కేశవులు, జ్యోతి, భారతి, కార్యకర్తలు వరలక్ష్మి, యుగంధర్‌రెడ్డి, ఎలమంద, కరుణాకర్‌ రెడ్డి, మహేష్‌రెడ్డి, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com