ప్రస్తుతం మాస్ మహరాజా రవితేజ వరుసగా రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా ఈ మూవీ తర్వాత మరో మూవీ చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రవితేజ సినిమా నీ కోసం చిత్రంతో దర్శకుడిగా సినీ కెరీర్ స్టార్ట్ చేశాడు శ్రీనువైట్ల. ఆ తరువాత వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను మంచి హిట్ అయ్యాయి. కానీ ప్రస్తుతం వరుస ప్లాపులతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు వైట్ల. అయితే గతంలో వరుస హిట్లతో దూసుకెళ్ళిన రవితేజ కూడా ప్రస్తుతం రేసులో కొంచెం స్లో అయ్యాడు. మళ్ళీ రేసులో దూసుకెళ్ళేందుకు వేగం పెంచాడు రవితేజ. తను చేసే రెండు చిత్రాల తరువాత రవితేజ శ్రీనువైటతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది. శ్రీను వైట్ల చెప్పిన కథ నచ్చడంతో శ్రీనువైట్లతో సినిమా చేయడానికి మాస్ మహరాజా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.