ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ డిప్యూటీపై ఆగ్రహంగా ఉన్న సిఎం ెకసిఆర్‌?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 19, 2017, 02:22 AM

  మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః వరంగల్‌ జిల్లాలోసి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న డాక్టర్‌ తాటికొండ రాజయ్యను సమస్యలు చుట్టుముడు తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నుండి రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన కడియం శ్రీహరి ఢీ కొట్టి 2009లో మొట ్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అధికార పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. స్పీకర్‌ అనర్హత వేటు వేయ డంతో జరిగిన ఉప ఎన్నికలలోను రెండవసారి, గత సార్వత్రిక ఎన్నికలలో వరుసగా మూడవసారి గెలిచి తెలంగాణ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఈ  ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్‌ ఎస్‌ గాలి వీయ డంతో  కెసిఆర్‌ నాయకత్వంలోని టిఆర్‌ఎస్‌ పార్టీ అధికా రంలోకి వచ్చింది. సీనియర్‌ దళిత ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్‌ రాజయ్యను తన క్యాబినేట్‌లోకి తీసుకన్న కెసిఆర్‌ వైద్య ఆరోగ్య శాఖ తో పాటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించారు. దాదాపు ఏడాది కాలం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. కానీ వైద్య ఆరోగ్య శాఖలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు రావ డం తో సిఎం కెసిఆర్‌ ఆగ్రహించారు. పైగా రాజయ్య వ్యక్తిగత జీవితానికి సంబం ధించి కూడా అనేక రకాలుగా పుకార్లు, షికార్లు చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనను పదవి నుండి భర్తరఫ్‌ చేస్తూ సిఎం కెసిఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో వరంగల్‌ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరిని క్యాబినెట్‌లోకి తీసు కుని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. తరువాత ఆయనను ఎమ్మెల్సీ చేశారు. పదవి కోల్పోయిన సంద ర్బంలో రాజయ్య మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆయన టిఆర్‌ఎస్‌ను వీడి ఇతర పార్టీలలోకి జంప్‌ చేస్తా రని ప్రచారం జరిగినప్పటికి రాజయ్య మాత్రం టిఆర్‌ఎస్‌లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. అధికార పార్టీలో కొనసాగడం ద్వారా కనీసం తన నియోజకవర్గంలోనైనా పట్టు సాధించాలని ఆయన తాపత్రయపడ్డారు. నియోజక వర్గంలో పర్యటస్తూ అభివృద్ది కార్యక్రమాలలో  పాల్గొంటు న్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పనులలో ఆయన అవినీతికి పాల్పడ్డారనే ఆరోప ణలు వచ్చాయి. తన నియోజకవర్గ జడ్‌పిటిసిలు, ఎంపి పిలతో కలసి కాంట్రాక్టర్‌లతో సమావేశమైన ఆయన తనకు పర్సంటేజిలు ఇస్తేనే ప్రారంభోత్సవాలకు హాజరవు తానని షరతు విధించారని ప్రచారం జరిగింది. తనతో పాటు స్థాని  ప్రజా ప్రతినిధులకు కూడా పర్సంటేజీలు ఇవ్వాలనే డిమాండ్‌ చేశారని ఆరోపణల నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు ఆయనను పిలిచి మందలించారు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండడంతో పాటు మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించింది. స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాన్ని సేకరిం చాలని సిఎం కెసిఆర్‌ కమిటీని ఆదేశించారు. 


   అయితే వరంగల్‌ నగరాన్ని ఆనుకుని ఉండే స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గాన్ని జనగాం జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే రాజయ్య ఉప సంఘానికి లేఖలు ఇవ్వడంతో  నియోజకవర్గ ప్రజలు భగ్గుమంటున్నారు. వీరికి స్థానిక ప్రజా ప్రతినిధులు కూడ తోడయ్యారు. పలు గ్రామాలలో ఆయన దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ఎమ్మెల్యే నిర్ణయాన్ని వ్యతిరే కిస్తూ జిల్లా  కలెక్టర్‌కు వినతి పత్రాలను సమర్పించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డ రాజయ్య మోహాన్ని చాటేశారు. 


    రాజకీయంగా ఎంతో అనుభవమున్న ఆయన అనేక తప్పులను చేస్తూ తన ఉప ముఖ్యమంత్రి పదవిని పోగొట్టు కున్నారు. కనీసం నియోజకవర్గంలో కూడ స్వేఛ్చగా తిరిగే పరిస్థితులను ఆయన తెచ్చుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com