హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు ఆకర్షిలవుతున్నారు. బంగారు తెలంగాణ సాధనలో పాలుపంచుకోవాలనే సంకల్పంతో ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. రాజేంద్రనగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో శంషాబాద్ మూడో వార్డు ఎంపీటీసీ, ఎంఐఎం నేత నజీముద్దీన్తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో కాంగ్రెస్, టీడీపీ నేతలు కూడా కారెక్కారు.