సౌదీ అరేబియాలో భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. మక్కా మసీదులో దాడులకు పాల్పడేందుకు సిద్ధమైన ఉగ్రవాదులపై పోలీసులు దాడి చేశారు. అయితే పోలీసులను చూడగానే.. ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో ఐదుగురు పోలీసులతో పాటూ 11 మంది గాయపడ్డారు. దాడికి యత్నించిన మహిళతో పాటూ మరో నలుగురిని అరెస్ట్ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం వెళ్లిన వారిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. ఐసిస్ ఉగ్రవాదులే ఈ కుట్రకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.