లండన్ : భారత హాకీ జట్టు తన చిరకాల శత్రువు పాకిస్థాన్ను మరోసారి చిత్తుగా ఓడించింది. హాకీ వరల్డ లీగ్ సెమీఫైనల్ లీగ్ వర్గీకరణ పోరులో పాక్ను 6-1తో చిత్తుచేసింది. రమణ్దీప్ (8ని, 28ని), తల్వీందర్ సింగ్ (25 ని), మన్దీప్ సింగ్ (27ని, 59ని), హర్మన్ప్రీత్ సింగ్ (36 ని) తరఫున గోల్స్ చేశారు. భారత ఫార్వర్డ్స దాడులను పాక్ ఏ దశలోనూ తట్టుకోలేక పోయింది. ఆ జట్టులో అజాజ్ అహ్మద్ (41 ని) ఒక్కడే గోల్ చేశాడు.