సూపర్స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ’రోబో’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో రోబో చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ’2.0’ చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్తో, హై టెక్నికల్ వాల్యూస్తో హాలీవుడ్ స్థాయిలో రూపొందుతున్న ’2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్ విలన్గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్ర విశేషాలను లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం తెలియజేస్తూ.. ’షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అదే స్థాయిలో ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. ’2.0’ చిత్రానికి సంబంధించిన ప్రచారంలో భాగంగా వరల్డ టూర్ ప్లాన్ చేశాం. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశాం. ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తునాం. దీపావళికి ’2.0’ ఫస్ట్లుక్ను, ప్రోమో టీజర్ను విడుదల చేసి, రజనీకాంత్గారి పుట్టినరోజున ట్రైలర్ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేశార. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోను అక్టోబర్లో దుబాయ్లో చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నార’ అన్నారు.