ముంబై: టీమిండియా కొత్త హెడ్ కోచ్ ఎవరో తేలడానికి మరికొద్ది రోజులు ఆగాల్సిందే. సోమవారం సాయంత్రంలోపు కోచ్ ఎవరో చెబుతామని అన్న గంగూలీ.. సాయంత్రానికి మాట మార్చాడు. తమకు మరికొన్ని రోజుల సమయం కావాలని, కెప్టెన్తోపాటు మరికొందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు. దీంతో ఉదయం నుంచి కొత్త కోచ్ ఎవరా అని ఎదురు చూసిన వాళ్లంతా ఉసూరుమన్నారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయమే తమకు కీలకమని దాదా చెప్పకనే చెప్పాడు. విరాట్ ఎవరి పేర్లనూ ప్రతిపాదించలేదని గంగూలీ తెలిపాడు.
ఇవాళ ఉదయం కొత్త కోచ్ ఎంపిక కోసం క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు బీసీసీఐ హెడ్క్వార్టర్స్కు వచ్చారు. వీళ్లతోపాటు కోచ్ పదవి కోసం అప్లై చేసుకున్న సెహ్వాగ్ కూడా వచ్చాడు. దీంతో ఇంటర్వ్యూల తర్వాత సాయంత్రంలోగా కొత్త హెడ్ కోచ్ ఎవరో ప్రకటిస్తారని అనుకున్నా.. గంగూలీ చివర్లో ఇలా ట్విస్ట్ ఇచ్చాడు. సోమవారం ఉదయం నుంచి కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న ఐదుగురిని సీఏసీ ఇంటర్వ్యూ చేసింది. రవిశాస్త్రితోపాటు సెహ్వాగ్, టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, లాల్చంద్ రాజ్పుత్లను ఇంటర్వ్యూ చేశారు. పానెల్లో గంగూలీ, లక్ష్మణ్ ఉండగా.. విదేశాల్లో ఉన్న సచిన్ స్కైప్ ద్వారా ఈ ప్రక్రియలో పాల్గొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa