ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండపోచమ్మ రిజర్వాయర్‌కు భూసేకరణకు శ్రీకారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2017, 10:17 AM

కొండపోచమ్మ రిజర్వాయర్‌కు భూసేకరణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులతో చర్చలు జరిపి అన్ని విధాల తాను అండగా ఉంటానని హామీ ఇచ్చిన తరువాత ముంపు గ్రామాల రైతులు భూములను స్వచ్ఛందంగా అప్పగించడానికి ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం వారి భూమి రికార్డులను పరిశీలించి నష్టపరిహారం చెక్కులను వెంటనే అందజేస్తున్నది. రిజర్వాయర్ ముంపు గ్రామాలైన మామిడ్యాల, బైలంపూర్, తానేదార్‌పల్లి, తాండ గ్రామాలకు చెందిన130 మంది రైతులు 300ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. వారికి ఎకరాకు 12లక్షల చొప్పున నష్టపరిహారం తాలూకు చెక్కులను అందజేశారు. నిర్వాసితుల స్థిరాస్తులపై సర్వే నిర్వహించి విలువను ఖరారు చేసి సదరు మొత్తాన్ని కూడా అందించనున్నారు. ఇవాళ్టి నుంచి గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో భూసేకరణకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నర్సారెడ్డి పాల్గొన్నారు. భూములు ఇచ్చిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అటు జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో భూసేకరణ పనులు చురుకుగా సాగుతున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa