ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో ఎయిర్‌టెల్‌లోనూ వీవోఎల్‌టీఈ సేవలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2017, 01:00 PM

భారతీ ఎయిర్‌టెల్ సంస్థ ఈ ఏడాది చివరి వరకు 4జీ వీవోఎల్‌టీఈ సేవలను ప్రారంభించనుంది. ముందుగా దేశంలోని 5 ప్రధాన టెలికాం సర్కిల్స్‌లో ఈ సేవలు ప్రారంభమవుతాయని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. దేశంలో వీవోఎల్‌టీఈ సేవలను అందిస్తున్న మొదటి టెలికాం సర్కిల్‌గా జియో గుర్తింపు పొందగా, జియో తరువాతి స్థానంలో ఎయిర్‌టెల్ వచ్చి చేరనుంది. ఇందుకు గాను ఎయిర్‌టెల్ గతంలో నోకియాతో రూ.402 కోట్ల ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది చివరి వరకు ఎయిర్‌టెల్ యూజర్లకు 4జీ వీవోఎల్‌టీఈ సేవలు లభ్యం కానున్నాయి. ఇక ఇతర టెలికాం సంస్థలైన ఐడియా, వొడాఫోన్‌లు కూడా వీలైనంత త్వరగా 4జీ వీవోఎల్‌టీఈ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa