ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు స్ప్రింకర్లు, డ్రిప్ పరికరాలు పంపిణీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2017, 02:29 PM

నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రేవల్లిలో రైతులకు స్ప్రింకర్లు, డ్రిప్ పరికరాలను మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. మొదటి విడతగా 131 మంది రైతులకు 310 ఎకరాల్లో పరికరాలను పంపిణీ చేశారు. రైతు సమగ్ర సర్వే ద్వారా అర్హులైన రైతులకు ప్రతి ఎకరాకు రూ. 4 వేలు వచ్చే మే 15 లోపు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ముందస్తు పెట్టుబడిగా రూ. 7 వేల కోట్లకు పైగా నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఈ ఏడాది సూక్ష్మ బిందు సేద్యం కోసం అత్యధికంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు రూ. 122 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. గతంలో మైక్రో ఇరిగేషన్ కేవలం 2.5 ఎకరాలకే ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దానిని 12.5 ఎకరాలకు పెంచామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కరెంట్ కొరత తీవ్రంగా ఉండేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. రానున్న కొద్ది కాలంలోనే మెట్ట ప్రాంతాలన్నింటికి సాగనీరందిస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. సబ్సిడి వేరుశనగ విత్తనాలను రైతులకు సరఫరా చేస్తున్నామని మంత్రి పోచారం చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa