భారతీయ టెలికాం రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు రిలయన్స్ జియో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. 4జీ ఎల్టీఈ కంటే గొప్ప అనుభూతిని పరిచయం చేసేందుకు రిలయన్స్ జియో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తొలిసారిగా 5జీ సేవలను ప్రారంభించబోతున్నట్లు జియో ప్రకటించింది. 5జీ సేవలను మరింత మెరుగ్గా అందించడం కోసం రిలయన్స్ జియో స్యామ్సంగ్తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ విషయాన్ని స్పెయిన్లోని బార్సిలోనియాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో అధికారికంగా ప్రకటించారు.
రిలయన్స్ జియో 5జీ తాలూకు ఉత్పత్తులను ఈ కాన్ఫరెన్స్లో ఆవిష్కరించింది. దక్షిణ కొరియాకు చెందిన ఓ టెక్నాలజీ సంస్థ రిలయన్స్ జియో పరిచయం చేసిన 5జీ డివైజ్లను తయారుచేసింది. స్యామ్సంగ్ కంపెనీ కూడా తన కొత్త 5జీ ఉత్పత్తులను ఈ మీట్లో ఆవిష్కరించింది. 5జీ హోమ్ రూటర్, 5జీ రేడియో బేస్ స్టేషన్, 5జీ మోడెమ్ చిప్సెట్స్ను స్యామ్సంగ్ రూపొందించింది. స్యామ్సంగ్, రిలయన్స్ జియో భాగస్వామ్యంతో త్వరలో ఇండియాలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో ప్రైమ్ మెంబర్షిప్ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. రిలయన్స్ జియో పూర్తి స్థాయిలో ప్రజలకు మెరుగైన నెట్వర్క్ను అందించిన తర్వాత 5జీ సేవలపై కసరత్తు చేయనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa