ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు టీఆర్‌ఎస్వీ విస్తృతస్థాయి సమావేశం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 17, 2017, 11:06 AM

టీఆర్‌ఎస్వీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం సోమవారం తెలంగాణభవన్‌లో అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన జరుగనున్నది. దీనికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు, టీఆర్‌ఎస్వీ సమన్వయకర్త పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ హాజరుకానున్నారు. విద్యార్థి సంఘం నాయకులుగా ఉండి వివిధ హోదాల్లో పనిచేసిన బొంతు రామ్మోహన్, గ్యాదరి కిశోర్, చిరుమళ్ల రాకేశ్, బాబా ఫసియుద్దీన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి కూడా హాజరై ప్రసంగిస్తారు. టీఆర్‌ఎస్వీ సభ్యత్వాల పుస్తకాలు, పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లు నాయకులకు అందిస్తారు. సమావేశం అనంతరం మెటీరియల్‌తో వెళ్లే వాహనాలను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభిస్తారు. గన్‌పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద శ్రద్దాంజలి ఘటిస్తారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com