సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని నర్సాపూర్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో భాగంగా నిర్మించిన పలు ఇళ్ల నిర్మాణాలను మంత్రులు కడియం శ్రీహరి, హరీశ్రావు ఇవాళ పరిశీలించారు. అంతకుక్రితం సిద్దిపేటలో నిర్మించిన ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. హరితహారంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.