ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముమైత్‌ఖాన్‌ మినహా అందరూ విచారణకు హాజరవుతారు : అకున్‌ సబర్వాల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 18, 2017, 05:16 PM

హైదరాబాద్‌ : రేపటి నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు డ్రగ్స్‌ కేసులో సినీ పరిశ్రమలో నోటీసులందుకున్న సినీ ప్రముఖులను విచారించనున్నట్లు ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. ఈ విచారణకు రోజుకొకరు మాత్రమే హాజరవుతారని, ముమైత్‌ఖాన్‌ మినహా మిగతావారంతా విచారణకు హాజరవుతామని చెప్పినట్లు అకున్‌ పేర్కొన్నారు. ముమైత్‌ఖాన్‌ బిగ్‌బాస్‌ షోలో ఉన్న కారణంగా విచారణ తేదీని ఇంకా నిర్ణయించలేదన్నారు. కొత్తగా ఇంకా ఎవరికీ నోటీసులివ్వలేదని అకున్‌ వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com