హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనసాగుతున్న చెక్డ్యామ్లు, వంతెనల నిర్మాణానికి సంబంధించిన పనులను రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లోని పలు రహదారుల వల్ల కొనసాగుతున్న చెక్డ్యామ్ల నిర్మాణాల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెక్డ్యామ్లు, వంతెనల నిర్మాణాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఇరత ఉన్నతాధికారులు పాల్గొన్నారు.