హైదరాబాద్: పార్టీ స్థాపించి మూడేళ్లకు పైబడ్డా.. ఇప్పటికీ జనసేన అంటే ప'వన్' మాన్ షోనే. ఆ అపప్రదను తొలగించుకుని పార్టీని విస్తరించుకోవాలన్న ఉద్దేశంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను పార్టీ కార్యకర్తలను పెంచుకునే పనిలో పడ్డారు పవన్. ఈ నేపథ్యంలోనే ప్రతీ జిల్లాలోను శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి.. పార్టీ అవసరాలకు అనుగుణంగా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ తతంగం ఇంకా పూర్తి కాకముందే.. కొంతమంది వ్యక్తులు తాము జనసేన నియమించిన నేతలమంటూ జిల్లాల్లో హల్ చల్ చేస్తున్నారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి.. ఏకంగా వసూళ్లకు కూడా దిగుతున్నారు. దీంతో ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షిర్యాదులు అందాయి. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన.. పార్టీకి డ్యామేజీ జరగకముందే యాక్షన్ లోకి దిగిపోయారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలంటూ అందులో పేర్కొన్నారు. పార్టీ తరుపున అధికారిక ప్రతినిధులెవరిని నియమించలేదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa