ట్రెండింగ్
Epaper    English    தமிழ்

​రామోజీ మనవరాలి పెళ్లిలో ప్రముఖులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2017, 08:27 AM

ఈనాడు అధినేత రామోజీరావు మనవరాలు సహరి- వీరేంద్రదేవ్‌ల వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం రాత్రి వివాహవేడుకకు హాజరై ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు, శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమాజీ మంత్రి వెంకయ్యనాయుడు, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు తదితరులు ఉన్నారు.


సినీహీరోలు పవన్ కల్యాన్, బాలకృష్ణ, దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి, కోడి రామకృష్ణ, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత ఆదిశేషగిరిరావు, నందమూరి హరికృష్ణ,మోహన్ బాబు, మంచు లక్ష్మి తదితరులు హాజరయ్యారు. వివాహ వేడుకకు హాజరైన ప్రముఖ అతిథులకు పెళ్లికూతురు తల్లిదండ్రులు కిరణ్, శైలజలు సాదరంగా ఆహ్వానం పలికారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com