ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టోల్‌ సిబ్బందిపై కార్పోరేటర్‌ తనయుడి దాడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2017, 09:38 AM

హైదరాబాద్‌: టోల్‌గేట్‌ డబ్బులు అడిగినందుకు కార్పోరేటర్‌ తనయుడు అనుచరులతో కలిసి టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ గండిమైసి టోల్‌గేట్‌ వద్ద చోటుచేసుకుంది. వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌ కార్పోరేటర్‌ లక్ష్మీప్రసన్న కుమారుడు మనీశ్‌గౌడ్‌ టోల్‌గేట్‌ మీదుగా వెళ్తుండగా సిబ్బంది టోల్‌ ఫీజు అడిగారు. దీంతో ఆగ్రహించిన మనీశ్‌ గౌడ్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. మాటా మాట్లా పెరగడంతో మనీశ్‌ తన అనుచరులతో కలిసి వారిపై కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మనీశ్‌, అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని కత్తులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com