లఖ్నవూ: సోమవారం రాఖీ పండుగను పురస్కరించుకుని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అక్కడి మహిళలకు ఓ ఆఫర్ ప్రకటించింది. ఆగస్ట్ 6 నుంచి 7 అర్థరాత్రి వరకు మహిళలు నాన్ ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
అంతేకాకుండా ఆ రోజు మహిళలు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. గురువారం ఆయన యూపీఎస్ఆర్టీసీకి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 66 జిల్లాల్లోని అన్ని బస్ స్టేషన్లలో ఉచిత వైఫై ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బస్స్టేషన్లో ఏ ప్రయాణికుడూ రెండు గంటలకు మించి ఎదురుచూడకూడదని ఆదేశించారు. కొన్ని బస్స్టేషన్లలో వాటర్ ఏటీఎంలు కూడా పెట్టించినట్లు పేర్కొన్నారు.