ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూపీ మహిళలకు రాఖీ కానుక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 04, 2017, 11:28 AM

లఖ్‌నవూ: సోమవారం రాఖీ పండుగను పురస్కరించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి మహిళలకు ఓ ఆఫర్‌ ప్రకటించింది. ఆగస్ట్‌ 6 నుంచి 7 అర్థరాత్రి వరకు మహిళలు నాన్‌ ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.


అంతేకాకుండా ఆ రోజు మహిళలు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. గురువారం ఆయన యూపీఎస్‌ఆర్‌టీసీకి చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 66 జిల్లాల్లోని అన్ని బస్‌ స్టేషన్లలో ఉచిత వైఫై ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా బస్‌స్టేషన్‌లో ఏ ప్రయాణికుడూ రెండు గంటలకు మించి ఎదురుచూడకూడదని ఆదేశించారు. కొన్ని బస్‌స్టేషన్లలో వాటర్‌ ఏటీఎంలు కూడా పెట్టించినట్లు పేర్కొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com