హైదరాబాద్, అమీర్పేట్: మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఓ ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్పేట్ మైత్రివనం వద్ద నార్కోటిక్ డ్రగ్స్ అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారమందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. మైత్రివనం వద్ద మకాం వేసిన ఆరుగురి సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఎస్సార్నగర్ పోలీసులకు అప్పగించారు.