హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12గంటల వరకు జరగనుంది. ఏపీలో 1435 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలో 1291 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. కాగా... ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు సెట్-3 ప్రశ్నాపత్రం ఎంపిక చేయగా తెలంగాణలో ఇంటర్ పరీక్షకు సెట్-సీ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు.