హైదరాబాద్ నాచారంలోని పారిశ్రామిక వాడలో తెలంగాణకు హరితహారం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి మొక్కలు నాటారు. హరితహారంపై ర్యాలీ నిర్వహించిన తర్వాత విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నట్లు డిప్యూటీ స్పీకర్ చెప్పారు.