హైదరాబాద్: నిజామాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టి హెల్మెట్ని బహుకరించింది. అనంతరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఇద్దరు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేటీఆర్ కవితకు చేనేత చీరను బహుకరించాడు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అన్నారు. అన్నాచెల్లెలు, అక్కా తమ్ముళ్లు అందరూ కలిసి సుఖసంతోషాలతో ఈ వేడుకను జరుపుకోవాలని ఆమె కోరారు.

|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa