వాసవీ కాలేజీ యాజమాన్యం మోసంతో ఆగమైన విద్యార్థులకు నష్టం కల్గకుండా చూస్తామని భరోసా ఇచ్చారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వారికి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ లో అవకాశం కల్పిస్తామన్నారు. ఎంసెట్ పరీక్షకు కూడా హాజరయ్యేలా వెసులుబాటు ఇస్తామన్నారు. విద్యార్థులు, ప్రభుత్వాన్ని మోసం చేసిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.