వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామ ప్రజలు ఇవాళ బొడ్రాయి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఈ పండుగ కు హాజరయి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, జిల్లా పార్టీ అధ్యక్షులు తక్కెలపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.