సీఎం కెసిఆర్ పోచంపాడు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సీఎం కెసిఆర్ పోచంపాడు పర్యటనలో భాంగంగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు పోచంపాడు గెస్ట్హౌస్ నుంచి బయలుదేరుతారు. 11 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దకు చేరుకుని పునర్జీవ పనులకు శంకుస్థాపన చేస్తారు. 11:30 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ హెడ్రెగ్యులేటర్ను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పోచంపాడ్ గెస్ట్హౌస్కు చేరుకుని భోజనం చేస్తారు. మధ్యాహ్నం 1:00 గంటకు పోచంపాడ్ గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి 1:10 గంటలకు బహిరంగసభా స్థలికి చేరుకుంటారు. 3:00 గంటలకు ముప్కాల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరుతారు. సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి భవన్కు చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa